Authorization
Tue March 18, 2025 01:10:23 am
- అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. దళిత బంధు పథకం ద్వారా బాగ్ అంబర్పేట డివిజన్ బతుకమ్మకుంటకు చెందిన శ్రీనివాస్కు మంజూరైన డీజీపీఎస్ సర్వే పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా అరకొర నిధులు మంజూరు చేసేవారని అన్నారు. ముఖ్యమంత్రి కెేసీఆర్ దళితుల సమగ్రాభివృద్ధి కోసం 10 లక్షల రుణాలు అందజేస్తున్నారని అన్నారు. విడతల వారీగా దళితులకు దళితబంధు పథకాన్ని అందజేస్తామని చెప్పారు.