Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
జవహర్నగర్ మున్సిపల్ కార్పోరేషన్లోని ప్రభుత్వ పాఠశాలలో.శనివారం సాయంత్రం డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబు రాలను నిర్వహించారు. కార్పొరేషన్ మహిళలలు వారి బతుకమ్మను మధ్యలో ఉంచి కోలాటాలు, ఉయ్యాల పాట లు, డీజే పాటల నడుమ వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమనికి మేయర్ మేకల కావ్యతో విచ్చేసిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.. మహిళలతో బతుకమ్మ ఆడి మహిళలను ఉత్సహ పరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన పండగ.. మన సంస్కతి.. మన సాంప్రదాయానికి ప్రతీక ఆడపడుచుల ఔన్నత్యానికి సూచి క అన్నారు. తెలంగాణ సంస్కతి, సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కార్పొరేషన్ ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఎంగిలి పూలను వెదజల్లుకొనే అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు అడబిడ్డలు అందరూ కలిసి తీరొక్క పూలు.తీరొక్క రంగులతో ఆడుకునే గొప్ప పండగ బతుకమ్మ అన్నారు. దేశంలో పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అనీ, ఇలాంటి సంస్కతి మన తెలంగాణలో ఉందన్నారు. ప్రతి ఏటా బతుకమ్మ కానుకగా చీరలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పుర ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు.