Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
సామాజిక సమస్యల పరిష్కారానికి ప్రజలకు అండగా నిలుస్తూ వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భా వం చెందిందనీ, రేపు ఆ దిశగా లక్ష్యం వైపు ఉంటుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మేడ్చల్ జిల్లా కార్యదర్శి నాగిని గల బాలఫీర్ అన్నారు. కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాచుపలి మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాజీవ్ గృహ కల్పలో కెేవీపీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలపీరు మాట్లాడుతూ 1998 అక్టోబర్ 2వ తేదీన కులవివక్ష వ్యతిరేక పొరాట సంఘం ఆవిర్భవించినట్టు తెలిపారు. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనే లక్ష్యాల సాధన కోసం ఒక చారిత్రక అవసరంగా ఏర్పడిందన్నారు. 23 ఏండ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, శ్మశాన స్థలాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత కరెంటు జీవో 342, కులాంతర వివాహేతుల ప్రోత్సాహం, రూ.2లక్షలా 50 వేలు పెంపు కోసం జీవో 12తోపాటు సంక్షేమ హాస్టల్ విద్యార్థుల నెలసరి ప్రాథమిక సమస్యల పరిష్కారం కోసం రూ.5 వేలు వచ్చేలా పోరాడి సాధించినట్టు తెలిపారు. కరోనా కష్ట కాలంలో కేవీపీఎస్ తమ వంతు బాధ్యతగా సుమారు రూ.20 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహనీయుల జయంతులు, వర్ధంతులు, రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, శ్రమ దానాలు నిర్వహించినట్టు తెలిపారు. కులాంతర వివాహా లను ప్రోత్సహిస్తూ అనేక ఆదర్శ వివాహాలు జరిపించి నట్టు తెలిపారు. కుల దురహంకార హత్యలపై దళితులపై దాడులు దౌర్జన్యాల ప్రతి ఘటనపై కేవీపీఎస్ ఉద్యమిం చిందని తెలిపారు. తక్షణం జరిగే పోరాటాలు, ఢిల్లీ తరహాలో దళితులకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలనీ, సాంఘిక సంక్షేమ హస్టల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలనీ, కాస్మోటీక్ చార్జీలు పెంచాలనీ, దళిత బంధును ప్రతి దళిత కుటుంబానికీ ఇవ్వాలనీ, దశల వారి ఉద్యమాలు కొనసాగిస్తున్నామన్నా రు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కెేవీపీఎస్ పోరాడుతుందన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం మతోన్మాద అరాచకాలకు వ్యతిరేకంగా కేవీపీఎస్ దృష్టి సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయ కులు లింగస్వామి, శంకర్, వంశి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.