Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ
నవతెలంగాణ-సరూర్నగర్
మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మహేశ్వరం నియోజకవర్గం టీిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవిందశర్మ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మద్దతుగా ఇంటింటి ప్రచార నిర్వహించారు. మునుగోడు అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమన్నారు. కాంట్రాక్టర్ల కోసం పార్టీ మారే రాజగోపాల్ రెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటారని, ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్తారు అన్నారు. ఇంటింటికీి తిరుగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ కి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ శ్రీధర్, బడంగ్పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, కప్పాటి పాండురంగారెడ్డి, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు నగేష్, నేలకొండ శ్రీనివాస్రెడ్డి, సాజిద్, శ్రీమన్నారాయణ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.