Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ రింగ్రోడ్డులో ఆటో స్టాండ్ తొలగించవద్దని సిఐటియు నగర ఆటో యూనియన్ నగర కార్యదర్శి కమలాకర్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం రింగ్రోడ్డులో ఆటో స్టాండ్ను తొలగించేందుకు వచ్చిన మెట్రో అధికారులను ఆటో కార్మికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కమలాకర్రెడ్డి, సిఐటియు ఉప్పల్ జోన్ అధ్యక్షులు పెద్దస్వామి, ప్రధాన కార్యదర్శి వెంకన్నలు మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి రింగ్రోడ్డులో ఆటో స్టాండ్ ఉందని, దీన్ని మార్చడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆటో స్టాండ్ను తీసేయడం వల్ల ఆటో కార్మికులు రోడ్డుపాలవుతారన్నారు. కెసిఆర్ కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటో స్టాండ్ను ఎత్తేయకుండా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దశరథ్, సత్తిరెడ్డి, రాంరెడ్డి, ఎండి.అహ్మద్, చందు, ఐఎఫ్టియు నాయకులు మల్లేష్, బలరాం, సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.