Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దిల్సుఖ్నగర్జోన్ప్రతినిధి
టిఆర్ఎస్ సరూర్నగర్ డివిజన్ అధ్యక్షుడిగా అంకిరెడ్డిని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నియమించారు. గురువారం ఆయ నకు ఎమ్మెల్యే తీగల నియామక ప త్రాన్ని అందజేశారు. ఈ సందర్భం గా అంకిరెడ్డి మాట్లాడుతూ సరూర్ నగర్ డివిజన్లో టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపా రు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎ స్ అభ్యర్థుల సత్తా చాటుతామన్నా రు. తనపై నమ్మకంతో పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మె ల్యే తీగల కృష్ణారెడ్డిలు డివిజన్ అ ధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. డివిజన్ అధ్యక్షుని ఎన్నికకు సహకరిం చిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బేర బాలకిష న్, దర్పల్లి అశోక్, రాజులకు కృతజ్ఞతలు తెలిపారు.