Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి
నవతెలంగాణ-సూరారం
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఉన్న ప్రయివేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి అన్నారు. గాజులరామారం డివిజన్ ఉషోదయకాలనీలోని కుత్బుల్లాపూర్ మండల గుర్తింపు పొందిన ప్రయివేటు పాఠశాల కార్యాలయంలో బాచుపల్లి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ-దుండిగల్ మండలాల పలు పాఠశాలల కరస్పాండెంట్స్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మరో అతిథి హైదరాబాద్ జిల్లా కొశాధికారి సయ్యద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సి.హెచ్.మహిపాల్లు హజరయ్యారు.
క్యూఎంఆర్ఎస్సీఏ నూతన కమిటీ నియామకం
ఈ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ అధ్యక్షులుగా ఉన్న శివరాత్రియాదగిరి మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా నియమితులవ్వడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కె.భిమయ్య, ప్రధాన కార్యదర్శి ఆల్వాల వనజ అశోక్, కోశాధికారిగా కె.ఈశ్వర్రెడ్డిలను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారితో పాటు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శివరాత్రియాదగిరి, ప్రధాన కార్యదర్శి కళ్ళెం కృష్ణారెడ్డి, కోశాధికారి జె.నాగరాజులను పలు పాఠశాలల కరస్పాండెంట్స్లు పాల్గొని పూలమాలలతో శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గండిమైసమ్మ దుండిగల్ మండల అధ్యక్ష కార్యదర్శులు లింగయ్య, సుదర్శన్, బాచుపల్లి అధ్యక్ష కార్యదర్శులు వై.సాంబశివనారాయణ, సుధాకర్ పాల్గొన్నారు.