Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
ఆకాశవాణి తెలుగు భాష పరిరక్షణకు ప్రాచూర్యానికి చేస్తున్న కృషి అనన్య సామాన్యమని ప్రముఖులు పేర్కొన్నారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో రెండు రోజుల పాటు ఆకాశవాణి (హైదరాబాద్ కేంద్రం) సాహిత్య అకాడమీ, భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆకాశవాణి తెలుగు భాష సాహిత్య సేవ అంశంపై సదస్సు జరిగింది. రెండో రోజు మంగ ళవారం జరిగిన సదస్సులో రచయిత్రి పి.వేదవతి రేడియోలో మహిళా చైతన్య కార్యక్రమాలు, పీఎస్ భట్టు రేడియోలో హాస్యం, మల్లారి సురిభాబు, హరికథ, యక్షగానాలు అంశంపై ప్రసంగించారు. సుమనస్పతి జానపద సాహిత్యం విజరుకుమార్ వ్యవసాయ ప్రసారలలో ప్రజల భాష కళగా కృష్ణమోహన్, లలిత సంగీతం అంశాలపై మాట్లాడగా సమ్మెట నాగమల్లేశ్వర్రావు రేడియోలో వార్తా రచన అంశంపై సోదా హరన ప్రసంగం చేశారు.
ముగింపు సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణ హాజరై మాట్లాడుతూ. ప్రజలకు అత్యంత సన్నిహితమైన మాద్యమం ఆకాశవాణి ప్రజలకు వాడుకభాషను పరిచయం చేయుటలో ముందన్నారు. ఆచార్య ఎన్.గోపి అధ్యక్షత వ హించిన సభకు ఆకాశవాణి సహాయ సంచాలకుడు వి. ఉదరుశంకర్ ప్రయోజనాత్మకమైన సదస్సును నిర్వహించా మని తుది పలుకులలో తెలిపారు. సుధామ కవితా గానం చేశారు.