Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హయత్నగర్ సర్కిల్ ఏఎంసీగా పనిచేస్తున్న పాం డురంగారావును జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి పరుషపదజాలం ఉపయోగించారం టూ ఏర్పడ్డ వివాదం కమిషనర్ జనార్దన్రెడ్డి సమక్షంలో సమసిపోయింది. పాండురంగారావుకు కెనడి క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి సమక్షంలో మంగళవారం సా యంత్రం అడిషనల్ కమిషనర్ భాస్కరాచారి, జోనల్ కమిషనర్లు రఘుప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, గంగాధర్రెడ్డిలు ఏఎంసీ పాండురంగారావు, కెనడిలతో ప్రత్యేక సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లా డుతూ ఏ ప్రభుత్వ శాఖలో లేదా విభాగంలో లేనివి ధంగా జీహెచ్ఎంసీలో కిందిస్థాయి కార్మికుడి నుంచి ఉన్నతాధికారి వరకు ఒకేవిధమైన మర్యాదను ఇస్తామని, దీనిలో భాగంగా వెంకటయ్య అనే కార్మికుడికి ఢిల్లీ స్థాయి లో సన్మానం చేయించామన్నారు. 'మర్యాదగా మాట్లాడు కుందాం...అందరినీ గౌరవిద్దాం' అనే నినాదాలతో ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూసే సంస్కృతిని జీహెచ్ఎంసీలో తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జీహె చ్ఎంసీని అగ్రస్థానంలో నిలిపేందుకుగాను ఐటీ విభా గం అడిషనల్ కమిషనర్గా తనపై ఉన్న ఒత్తిడిలో భా గంగా పొరపాటున నోరుజారానని, దీనికి నిరభ్యంతరంగా క్షమాపణ కోరుతున్నానని కమిషనర్కు కెనడి స్పష్టం చేశారు. ఉన్నతాధికారి తనపై చేసిన కామెంట్ను విధి నిర్వహణలో భాగంగానే స్వీకరిం చానని ఏఎంసీ పాండురంగారావు పేర్కొన్నారు. మొ త్తానికి ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కమిష నర్ పేర్కొనడంతో ఏఎంసీ పాండురంగారావు, అడిష నల్ కమిషనర్ కెనడిలు అంగీకరించారు.
దిష్టిబొమ్మ దహనం
ఏఎంసీ పాండురంగారావును దూషించిన అదనపు కమిషనర్ జయరాజ్ కెనడి దిష్టిబొమ్మను తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూని యన్ ఆధ్వర్యంలో దహనం చేశారు. అనంతరం జీహె చ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిరసన తెలిపారు. కెనడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.