Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
బాలాపూర్ మండలంలోని బడంగ్పేట నగరపంచాయతీ పరిధి మల్లా పూర్లోని సర్వేనెంబర్ 73లోని 15 ఎకరాల పొలంలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లకు బుధవారం ఉదయం 9గంటలకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డిలు శంకుస్థాపన చేస్తున్నట్టు మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని సూచించారు.
ఎల్బీనగర్లో 1500 ఎల్ఈడీ లైట్లు పంపిణీ
రూ.15లక్షలతో 1500 ఎల్ఈడీ లైట్లను సరూర్నగర్ డివిజన్ పరిది óలోని వెంకటేశ్వరకాలనీ, హుడాకాంప్లెక్స్, హుదాకాలనీ, భగత్సింగ్ నగర్లో ఎమ్మెల్యేతో కలిసి కార్పొరేటర్ సారుపల్లి అనిత దయాకర్రెడ్డి మంగళవారం పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చెప్పిన విధంగా సరూర్నగర్లోని అన్ని కాలనీల్లో ఎల్ఈడీలైట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు డాక్టర్ తీగల అనితారెడ్డి, అంకిరెడ్డి, బేర బాలకిషన్, ముకుంట్ల అరవింద్శ్యాం, కందాటి జంగారెడ్డి, కేశవరెడ్డి, ఇస్మాయిల్, సలీం, వార్డుమెంబర్స్ వెంకటేష్యాదవ్, జహీర్, ఉషా, కట్ట ప్రవీణ్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.