Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఉప్పల్
క్రీడలు యువతకు మానసికోల్లాన్ని కల్గిస్తాయని కార్పొరేటర్ మేకల అనలారెడ్డి అన్నారు. ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న అండర్ 14-17, కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలను ఉప కమిషనర్ యాదగిరిరావు, ఎస్సై వెంకటేశ్వర్లతో కలసి ఆమె ప్రారంభించారు. ఈ పోటీల్లో సుమారుగా 24 స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నట్టు తెలిపారు. ఈ సంరద్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక ధృడత్వానికి ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, విద్యార్థులు, పాల్గొన్నారు.