Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్
నవతెలంగాణ - నారాయణగూడ
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు డిమాండ్స్ డే కార్యక్రమాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపునిచ్చింది. మంగళవారం హిమాయత్ నగర్లోని అమృత ఎస్టేట్స్లోని రైతు భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమాశంలో సంఘం అధ్యక్షులు టి.విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, ఉపాధ్యక్షులు ఎం.ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ 2016 ఫిబ్రవరి 28న ప్రధాన మోడీ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తామని, 2022 నాటికి రైతుల ఆర్థిక స్థితి రెండింతలు పెరగడానికి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. రైతు కుటుంబ సభ్యులలో ఒకరికీ ఉద్యోగం కల్పిస్తామని, వ్యవసాయానికి బడ్జెట్లో ఎక్కువ నిధులను కేటాయిస్తామని ప్రకటించిన విషయం వారు గుర్తు చేశారు. హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ ఘోరంగా వైఫలమైం దన్నారు. గతేడాది మద్దతు ధరల కంటే వరికి రూ.30, మొక్కజొన్న రూ.60, జొన్నకు రూ.75 ప్రకటించి చేతులు దులుపుకున్నారని తెలిపారు. పంటసాగుకు అయ్యే ఖర్చు కన్నా తక్కువ ధరలను ప్రకటించిందన్నారు. వరి సాగు ఖర్చు 50 శాతం, మొక్క జొన్న 90, పత్తి 150 శాతం పెరిగాయన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతాంగం మొత్తంగా కుంగిపోవడానికి కారణ మవుతుందన్నారు. పంటలన్నింటికీ డాక్టర్ స్వామి నాథన్ కమిషన్ చెప్పిట్టుగా గిట్టుబాటు ధరలను అమలు చేయాలని, దీన్ని పార్లమెంట్లో చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9లోపు రైతు సమితుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమన్వయ సమితులను నామినేట్ చేస్తామని తెలిపారు. వ్యవసాయ పెట్టుబడి పథకం, పంటలకు గిట్టుబాటు ధర, పంటకాలనీల ఏర్పాటులో రైతు సమితులే కీలకపాత్ర పోషిస్తాయని, కానీ ఆచరణలో వీటి అమలుపై స్పష్టమైన విధానం ప్రకటించ లేదన్నారు. 2016 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో, ప్రయివేటు బ్యాంకుల్లో వడ్డీ వ్యాపారస్తుల వద్ద ఉన్న రైతుల రుణాలను రద్దు చేయాలని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని, 60 ఏండ్లు నిండిన రైతులందరికీ రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని, భూసంస్కరణలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.