Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని పల్లె చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయని, డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని శాంతినగర్, వాంబేకాలని, మార్కేండయనగర్, బస్తీల్లో జరిగిన గణేష్ ప్రత్యేక పూజల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులకు అందరూ సహకరించి నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. నిమజ్జం రోజు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ అధికారుల మీదనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హన్మంత్రెడ్డి, రాజు, చిన్న, రమేష్ రాము పాల్గొన్నారు.