Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
శ్రీత్యాగరాయ గాన సభలోని కళాసుబ్బారావు కళావేదికపై మంగళవారం అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా జీఎస్ రామకృష్ణ మిత్రమండలి ఆధ్వర్యంలో జాన పద కవిగాయక సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ జానపద గాయకుడు పి.వి చలపతిరావు పాల్గొని మాట్లాడుతూ. తెలంగాణ జానపద కళలకు పుట్టినిల్లు అన్నారు. ప్రతి జాతి జానపద కళారూపాలు పరిరక్షించుకోవాల్సిన అవసరముంద న్నారు. కోడిబాయె లచ్చమ్మ పాట తాను పాడితే నేటికి ప్రజలు ఆధరించడానికి కారణం ఆపాటలోని సంగీత సాహిత్యాలే నన్నారు. సాహితీ వేత్త ఆచార్య గౌరీ శంకర్ అధ్యక్షత వహించిన ప్రముఖ కవి ఆచార్య నాలేశ్వరం శంకరం, విమర్శకుడు తంగిరాల చక్రవర్తి తదితరులు జాన పద కవిత్వాని గురించి విశ్లేశించారు. గాన సభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి పాల్గొన్న కార్యమ్రాకానికి తొలుత జీఎస్ రామకృష్ణ, వసుంధర, రమాదేవి, సవితా ప్రసాద్లతో కలిసి పాడిన జానపద గీతాలు ప్రేక్షకులను అలరించాయి.