Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరర్ రిపోర్టర్
మిమిక్రీ వేణుమాధవ్ కళారంగంలో చిరస్మరణీయులుగా నిలిచిపో తాడని ప్రముఖులు నివాళులర్పించారు. శ్రీ త్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై గురువారం ఇటీవల మృతి చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ సంస్మరణ సభ, ఆనంద లహరి సంస్థ నిర్వహణలో ఆయన శిష్య, ప్రశిష్య, శిష్యులు నిర్వహించారు. సినీ నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలుగు జాతికే వేణుమాధవ్ గర్వకార ణమని, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వాడిగా ఆయన తన ప్రదర్శనలతో దేశ కీర్తిని పెంచారన్నారు. ప్రముఖ మైమ్ కళాకారులు జెమ్మి, కళాధర్, ఇంద్ర జాల కళాకారుడు రమణ, మిమిక్రీ కళాకారుడు రవి, చంద్రముఖి చంద్రశేఖర్, సతీష్, శివ, తదితరులు తమకు వేణుమాధవ్తో ఉన్న అనుబం ధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమ నిర్వహకుడు మల్లం రమేశ్ వేణు మాధవ్ తనకు పితృ సమానులని ఆయన లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.