Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ సీనియర్ నాయకులు అరవింద్రెడ్డి
నవతెలంగాణ- మలక్పేట
ప్రయివేటు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా పాఠశాల యజమాన్యం తల్లిదండ్రుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు కటకరెడ్డి అరవింద్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మన్సూరాబాద్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రయివేటు పాఠశాలలో స్థానిక కాలనీ అసోసియేషన్ నాయకులతో కుమ్మకై ఖాళీ స్థలాలను చూపించి పాఠశాలలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటారని ఆయన తెలిపారు. పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలోనే పుస్తకాలు, షూ, యూనిఫాం, స్టేషనరీ వస్తులను తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నా రన్నారు. డోనేషన్ ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్నారు. ఏ పాఠశాలలో విద్యార్థులు ఆడు కోవడానికి ఆట స్థలాలు లేవలన్నారు. ఇలాంటి పాఠశాలలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసు కోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో రంగారెడ్డి అధికార ప్రతినిధి తడకమళ్ల విజరుకుమార్, బీఎన్రెడ్డి టీడీపీ అధ్యక్షులు కొట్రా రవిశంకర్, నాయకులు చెక్క అశోక్కుమార్, కిశోర్, గోపి, రాజు తదితరులు పాల్గొన్నారు.