Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
నగర శివార్లలోని చర్లపల్లి టెర్మినల్ వద్ద పనులు త్వరలో ప్రారంభించి వచ్చే మూడేండ్లలో పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ అన్నారు. టెర్మినల్ విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్రం భూమిని కేటాయించిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే నాగులపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన మెగా టర్మినల్కు మూడు వందల ఎకరాల భూమి అవసర పడుతుందని, దీనికి సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఆధునీకరించిన ప్రజా సంబంధాల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆలోచన విధానాలకు అను గుణంగా తమ రైల్వే జోన్లో భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. భద్రతకు ప్రాధాన్యమివ్వడం వల్ల రైళ్లు సమయ పాలనతో నడుస్తున్నాయని, దీంతో రైళ్ల సమయ పాలనలో స్వల్ప ప్రభావం పడిందన్నారు. భద్రత, సమయ పాలనను సమన్వయ పరుస్తూ తాము వినియోగ దారులను సంతృప్తి పరిచగలుగుతున్నామని చెప్పారు. రైళ్ల సమయ పాలన పాటించటంతో ఒక్క రోజులోనే రైళ్ల రాకపోకలను 75 నుంచి 85 శాతానికి పెంచగలిగామన్నారు. ఈ ఆరు నెలల కాలంలో తమ జోన్ పరిధిలో దాదాపు 60 లెవెల్ క్రాసింగ్లను తొలిగించామని, మిగిలినవి ఈ సెప్టెంబర్ మాసం చివరిలోగా తొలిగిస్తామన్నారు. నాలుగేండ్లలో తమ జోన్ పరిధిలో చేపట్టిన అభి వృద్ధి కార్యక్రమాలైన కొత్త రైలు మార్గాలు, డబ్లింగ్, ట్రిప్లింగ్, విద్యుదీకరణ విషయాల్లో దాదాపు మూడు రెట్లు అభివద్ధి జరిగిందని చెప్పారు.