Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యాలు మోసం చేస్తున్నాయని ఎంపీటీసీ జైపాల్రెడ్డి అన్నారు. మండలంలోని అలియాబాద్ గ్రామ పరిధిలోని పొకర్ణ గ్రానైట్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ కార్మికులు కనీస వేతనాల కోసం చేస్తున్న ధర్నా గురువారానికి ఎనిమిది రోజుకు చెరుకుంది. వారికి మద్దతుగా జైపాల్రెడ్డి ధర్నాలో పాల్గొన్ని మాట్లాడారు. కార్మికులు కోరే న్యాయమైన డిమాండ్లపై వెంటనే చర్చలు జరిపి పరిష్కరించాలన్నారు. లేదంటే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకట్రెడ్డి, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.