Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అంబర్పేట
విద్య, వైద్యం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేస్తుందని రాష్ట్ర గవర్నర్ నరసిం హన్ అన్నారు. గురువారం నారాయణగూడ ఐపీఎం (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) ప్రాంగణంలోని తెలంగాణ డయా గ్నోస్టిక్ సెంట్రల్ ల్యాబ్ను రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పేదలకు అందుబాటు లో ఉండేవిధంగా డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అత్యాధునిక పరికరాలతో 24 గంటల్లో రిపోర్టును అందిస్తారన్నారు. ఈ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. త్వరలో బస్తీ దవాఖానాలు, జనరిక్ మెడిసన్ షాపులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యా ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఎ.శాంతికుమారి, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ కె.శంకర్ పాల్గొన్నారు.
మల్కాజిగిరి : బస్తీ దవాఖానాలో గవర్నర్ తనిఖీలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకుగానూ గత నెల మల్కాజిగిరి సర్కిల్లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాలో గవర్నర్ ఈఎల్ఎస్ నరసింహన్ గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరిలోని బాబు జగ్జీవన్నగర్, ఆనంద్బాగ్లలోని దవాఖానాలను తనిఖీలు చేసి, పలు రికార్డులను, ఆస్పత్రి నిర్వహణ తీరును పరిశీలించి, వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం గవర్నర్ వైద్యులనుద్దేశించి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.
తద్వారా సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతుందని వివరించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషిచేస్తున్న తరుణంలో వైద్యులు నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. అనంతరం మల్కాజిగిరిలోని దవాఖానాలో వైద్యులు గవర్నర్కు బీపీ పరీక్షలు నిర్వహించారు. కాగా బాబు జగ్జీవన్ దవాఖానాలో ఫార్మసిస్ట్ లేదని, తద్వారా రోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆయనతో పాటు మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నారు.