Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన కేంద్ర మంత్రి మన్సుఖ్
నవతెలంగాణ - కంటోన్మెంట్
తిరుమలగిరిలో భారతీయ ప్రధాన మంత్రి జనరిక్ మెడికల్ కేంద్రాన్ని కేంద్ర రోడ్డు అండ్ రవాణా ట్రాన్స్పోర్టు శాఖ మంత్రి మన్సుఖ్ మాన్డవ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్ సర్వీస్మెన్ గోపు రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి మన్సుఖ్ను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధాన మంత్రి ప్రజలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలకు మందులు లభించేందుకు కృషి చేయడంలో భాగంగా ఔషధ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం గోపురమణరెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఈ ఔషదాలయాలను ప్రారంభించడం ఎంతో ఉపయోగ కరమైందన్నారు. ఇక్కడ మందులపై 50 నుంచి 90 శాతం డిస్కౌంట్తో ఉంటుందని తెలిపారు. ఈ ఔషద కేంద్రాలు మధ్య తరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతా యన్నారు. సికింద్రాబాద్లో మొత్తం ఎనిమిది ప్రధానమంత్రి ఔషద కేంద్రాలను ఏర్పాటు చేశామని రమణారెడ్డి వివరించారు. కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏఎస్రావునగర్ : కాప్రాలోనూ ప్రధాన మంత్రి జన ఔషద కేంద్రాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో కలిసి కేంద్ర మంత్రి మన్సూఖ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన ఔషదాలను అతి తక్కువ ధరలకే అందించాలన్నారు. ప్రధాన మంత్రి జనరిక్ ఔషద కేంద్రాలను బీజేపీ రాష్ట్ర కో-కన్వీనర్ మాజీ సైనికుడు గోపురమణారెడ్డి ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయ డం అభినందనీయమన్నారు. మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవ చేయాల న్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జాజుల గౌరి, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పవిత్ర, మేడ్చల్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ఇందిరాగౌడ్, హైమావతి, అపర్ణగౌడ్, కామేశ్వరి పాల్గొన్నారు.