Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బేగంపేట
మ్యాన్హోల్లోకి పారిశుధ్య కార్మికులు దిగాల్సిన అవసరం లేకుండా చెత్తాచెదారాన్ని తొలగించేందుకు కార్పొరేటర్ అత్తెల్లి అరుణ గురువారం సూపర్ సక్కర్ మిషన్ను మహారాష్ట్ర నుంచి తెప్పించారు. ఈ సందర్భంగా రాంగోపాల్పేట డివిజన్ పరిధిలోని డిస్టనరీ రోడ్డులో మిషన్ ద్వారా నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. ఈ మేరకు వాటర్ వర్క్స్ సెక్షన్ విభాగపు అధికారి ఆశిష్ పాల్గొని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ మిషన్ మ్యాన్హోల్ లోపలికి కార్మికుడు దిగాల్సిన అవసరం లేకుండా పనిచేస్తుందని తెలిపారు. మ్యాన్హోల్ లోపలికి హైడ్రోలింకు సిస్టమ్తో ఆపరేట్ చేస్తూ మురుగు నీటిని రీ సైక్లింగ్ చేస్తూ బయటికి విడుదల చేస్తుందని మిషన్ పనితీరును వివరించారు. అంతే కాకుండా అధిక పీడనంతో మ్యాన్హోల్ వరకు జెట్టింగ్ పనులనూ ఈ మిషన్ పనులు నిర్వహిస్తుండడం, ఎక్కువ లోతులో ఉన్న మట్టిని తీసే సామర్థ్యత ఉందన్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.