Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
జమ్మిగడ్డ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీపై మేయర్ బొంతు రామ్మోహన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా 16 కాలనీల ప్రజలు ఆయన దిష్టిబొమ్మను గురువారం జమ్మిగడ్డలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాప్రా సర్కిల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కృష్ణవేణి మాట్లాడుతూ శాంతివనం కబ్జా చేస్తున్నారని వాటిని పరిరక్షించాలని మేయర్ను, కార్పొరేటర్ను పలుమార్లు వేడుకున్నా పట్టించుకోలేదని అన్నారు. మేయర్ సహకారంతోనే కబ్జాకు గురవుతుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మిగడ్డలోని 16 కాలనీల ప్రజలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఇందుకు సహించలేని మేయర్ కాలనీల ప్రజలపై శ్మశాన వాటిక కమిటీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎస్రావునగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు గోలిశ్రీనివాస్, వివిధ కాలనీల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.