Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ విజయశాంతి
నవతెలంగాణ - నేరేడ్మెట్
అల్వాల్ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా డివిజన్లో ఐదు లక్షల రూపాయల వ్యయంతో భూగర్భ డ్రెయినేజీ పనులను ఆమె గురువారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. రోడ్లు, డ్రెయినేజీ తదితర సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. డివిజన్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీచ్చారు. ఈ కార్యక్రమంలో చింతల శ్రీనివాస్రెడ్డి, డీఈ మహేష్, యాదిగిరి, ఆనంద్రావు, నాయర్, గణేష్, మోహన్, ప్రేమ్కుమార్, ప్రవీణ్, కవిత, వీణ, గాయిత్రి పాల్గొన్నారు.