Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గచ్చిబౌలి
విధుల్లో ఉన్న హోంగార్డు తన నిజాయితీని నిరూపించుకున్నాడు. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి తన బ్యాగ్ను మాదాపూర్ దర్గా జంక్షన్లో పోగొట్టుకున్నాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు అశోక్కుమార్ సదరు బ్యాగును తీసుకుని అందులో ఉన్న వివరాల ప్రకారం ఫోన్ చేసి పోగొట్టుకున్న వ్యక్తికి అందజేశారు. అందులో ల్యాప్ట్యాప్, విలువైన డాక్యుమెంట్లు, అకౌంట్బుక్స్ ఉన్నాయని బాధితుడు లారెన్స్ డి.సౌజా తెలిపారు. అనంతరం హోంగార్డుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.