Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్
నవతెలంగాణ - మల్కాజిగిరి
తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్క రించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మల్కాజిగిరిలో గురువారం టీజేఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరిలో మొట్టమొదటి పార్టీ కార్యాలయం ఇదేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నట్టెట ముంచిందని, కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అమలు కావడం లేదని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్బెడ్రూం ఇండ్లు ఎవరికీ అందలేదని, పేదల విషయంలో మోసగిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్య క్రమంలో విద్యార్థి సంఘం నాయకులు, రాష్ట్ర సంఘం నాయకులు ప్రవీణ్, టీజేఎస్ పార్టీ కోఆర్డినేటర్ రెడ్డిపాల్ శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా నాయకులు చుండు శోభన్, మహీందర్, ఆంజనేయులు, రవి, మణిశంకర్, శోభరాణిగౌడ్, భవాని పాల్గొన్నారు.