Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధూల్పేట్
అనుమానంతో యువకుడిపై ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కాలాపత్తార్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ములుగురి రవి తెలిపిన వివరాల ప్రకారం కాలా పత్తార్లో నివాసముంటున్న ఇబ్రహీం అలియాస్ రఫీక్(32) ఓలా క్యాబ్ డ్రైవ ర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కాలా పత్తార్లోనే నివాసముండే కార్ హెడ్ క్వార్టర్స్లో హోంగార్డుగా విధులు నిర్వహి స్తున్న మహ్మద్గౌస్ ఇంట్లో ఇబ్రహీం నివాసముంటు న్నాడు. తాను ఇంట్లో లేనప్పుడు ఇబ్రహీం తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని మహ్మద్గౌస్ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో రెండు నెలల కితం ఇబ్రహీంను మహ్మద్గౌస్ తన ఇంట్లో నుంచి ఖాళీ చేయించాడు. తనకు చెల్లేలు లాంటిదని ఇబ్రహీం నచ్చజేప్పిన గౌస్ వినకుండా బల వంతంగా ఖాళీ చేయించాడు. ఇల్లు ఖాళీ చేసినా.. అనుమానం తీరని మహ్మద్గౌస్ ఇబ్రహీంపై దాడి చేసేం దుకు వ్యూహాం రచించాడు. ఈ క్రమం లో బుధవారం కాలా పత్తార్లోని పాఠ శాలలో పిల్ల లను ఇబ్రహీం వదిలేసి తిరుగు ప్రయా ణంలో మధ్యాహ్నం 1:30గంటలకు కాలాపత్తార్కు వెళ్తుండగా గమనించిన మహ్మద్గౌస్ ఇబ్రహీంను మాట్లాడుకుందామంటూ కాలా పత్తార్లోని తన బావమరిది న్యాయవాది అక్రం కార్యాలయానికి తీసు కెళ్లాడు. అక్కడ ఇబ్రహీం, గౌస్ మధ్య మాటామాట పెరగడంతో గొడవ పెద్దదైంది. దీంతో మహ్మద్గౌస్ మటన్ షాపులో వినియోగించే కత్తితో ఇబ్రహీం మెడ పై భాగంలో దాడి చేశాడు. వీపు లోనూ గాయ పరిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. గాయాలతోనే ఇబ్రహీం కాలాపత్తార్ పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం బాధి తున్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలి ంచారు. మెడపై భాగంలో ఆరుకుట్లు పడ్డాయని, ప్రస్తుతం ఆరోగ్యం గానే ఉన్నాడని వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న మహ్మద్గౌస్ను త్వరలోనే పట్టు కుంటామని పోలీసులు తెలిపారు. కేసును ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.