Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ముషిరాబాద్లోని సినీగిల్డ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లే అవుట్లో పార్కు నిర్మాణానికి కేటాయించిన 1,087 చదరపు అడుగుల భూ మిని తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జా చేయడం, పలు బ్యాంకుల నుండి రుణాలు పొందడానికి కొందరు కబ్జాదారులు ప్రయత్నిస్తున్నందున ఈ విష యమై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నగరవాసులకు ముషిరాబాద్ డిప్యూటీి కమిషనర్ కృష్ణశేఖర్ హెచ్చరించారు. ఈ భూమికి సంబంధించి హైకోర్టు, ఇతర కోర్టుల్లో పలు వాజ్యాలు ఉన్నందున సినీగిల్డ్ కో-ఆపరేటివ్ సొసైటీకి చెందిన ఈ భూముల లావాదేవిలో పాల్గొనకూడదని కృష్ణశేఖర్ స్పష్టం చేశారు.