Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుర్కయంజాల్
హయత్నగర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలిపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టిన నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులకు సోమవారం విప్ జారీ చేసిన సంఘటన విధితమే. గురువారం విప్ నోటీసులను ఎంపీటీసీలకు అందజేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. రేపు నిర్వహించే ఎన్నికలో టీడీపీ నుంచిత గెలుపొందిన హరితకు అనుకూలంగా ఓటువేయాలని కోరారు. లేనియెడల వారి ఎంపీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. విప్ నోటీసుకు అననుకూలంగా ఓటు వేసిన ఎంపీటీసీలకు రాబోయే ఎన్నికల్లో రెండు పర్యాయాలు అనర్హులుగా ప్రకటించాలని కోరారు.