Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ముదిరాజ్ సంఘం
నవతెలంగాణ-నారాయణగూడ
55 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ముదిరాజ్సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ తెలిపారు. ఎన్నికల దృష్టా రాష్ట్ర వ్యాప్తంగా 70 స్థానాల్లో ముదిరాజ్లు ఎన్నికల బరిలో దిగనున్నట్టు ఆయన వివరించారు. సంఘం ఆధ్వర్యంలో గురువారం హిమాయత్నగర్లోని బీసీ సాధికారత సంస్థ కార్యాలయంలో 'ముదిరాజ్క రాజకీయ' రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలు తమ సామాజిక వర్గాన్ని కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకే వాడుకుంటూ, చట్ట సభల్లో ప్రాతినిధ్యాన్ని కలించటంలో మాత్ర మొండి చేయి చూపిస్తూన్నాయని ఆరోపించారు. తమ సామాజిక వర్గం సుమారు 20 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు రమణ, వినరు, మధన్ మోహన్ ముదిరాజ్, హనుమండ్లు ముదిరాజ్, సతీష్ ముదిరాజ్, మధుసూధన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.