Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ టీడీపీ టికెట్ ఇవ్వాలని ఎల్ రమణకు వినతి
నవతెలంగాణ- ధూల్పేట్
రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి నగర బీసీ సెల్ అధ్యక్షుడు బద్రినాథ్యాదవ్ను టికెట్ ఇచ్చి ప్రోత్సహించాలని నగర బీసీ సెల్ కోర్ కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా గురువారం కోర్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు గరికపాటీ రామ్మోహన్రావు, పెద్దిరెడ్డిలను కలిసి వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నాయకులు, నగర బీసీ సెల్ అధ్యక్షులు బద్రినాథ్కు అవకాశం కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో నగర బీసీసెల్ వైస్ ప్రెసిడెంట్ జగదీష్, పండు, లక్ష్మణ్, సాంబశివరావు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ జగదీష్, అధికార ప్రతినిధి అనిల్ కుర్మా, ఆర్గనైజింగ్ కార్యదర్శి పరకాల రజినీకాంత్గౌడ్, గోపాల్, జగన్మోహన్, కార్యదర్శి వెంకటేష్, ఎస్ నారాయణమూర్తి, ప్రకాష్ పాల్గొన్నారు.
ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని క్యామ మల్లేష్కు..
ఏఎస్రావునగర్ : ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్కు చెందిన నాయకులు సింగిరెడ్డిసోమశేఖర్రెడ్డి గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు క్యామమల్లేష్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సోమశేఖర్రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తాను విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ అనుబంధ సంఘం ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్లో వివిధ వర్గాల్లో పనిచేశానని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన సతీమణి శిరీషారెడ్డికీ కార్పొరేటర్గా పనిచేసే అవకాశం కల్పించాలని, అదే విధంగా త్వరలో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని బయోడేటాను అందజేసినట్టు తెలిపారు. టికెట్ కేటాయిస్తే విజయం తథ్యమన్నారు. కార్యక్రమంలో టిల్లుయాదవ్, లింగస్వామి, సేవాదల్యాదిగిరి, నాను, బబ్బి, శ్రీకాంత్రెడ్డి, లలిత్, భరత్, తిలక్, రాంరెడ్డి, శ్రీనివాస్లు పాల్గొన్నారు.
మలక్పేట కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని ఆజాద్కు..
చాదర్ఘాట్ : కాంగ్రెస్ మలక్పేట నియోజవకర్గ టికెట్ను మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీ శ్రీనివాస్కు కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆజాద్కు గురువారం వినతిపత్రం అందించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ మేరుగు సంఘం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తోందని, రాహుల్ను ప్రధానిగా గెలిపించడమే లక్ష్యంగా కృషిచేస్తామన్నారు. మలక్పేట కాంగ్రెస్ టికెట్ను తమకు కేటాయిస్తే బీసీ ఓట్ల అండతో నియోజకవర్గంలో గెలుపు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మలక్పేటలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని గుర్తు చేశారు.
గచ్చిబౌలి : కూకట్పల్లి ఎమ్మెల్యే టికెట్ తనకే కేటాయించాలని కూకట్ పల్లి కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కల వెంగళ్రావు కోరారు. ఆ పార్టీ జాతీయ నాయకులు గులాంనబీ ఆజాద్ను గురువారం గాంధీ భవన్లో కలిశారు.
ఈ సందర్భంగా ఆజాద్కు విన్నవించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ తాను రాజకీయ ఆరంగేట్రం చేసిందే కాంగ్రెస్లో అన్నారు. ఈ సారి తనకు టికెట్ ఇస్తే తప్పకుండా కూకట్పల్లిలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చున్ను పాషా , నాగ రాజు, రాజు ముదిరాజ్, సూరజ్ కుమార్ తివారీ, మధు, చైతన్య యాదవ్, నర్సింగ్రావు, గణేష్ ఉన్నారు.