Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధ్దారెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
రాజకీయాలకు అతీతంగా పాలన మారాలని, ప్రతి పౌరుడికి అనుకూలంగా పాలన సాగాలని, పౌరుడి కేంద్రంగా ప్రభుత్వం పని చేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. గురువారం చైతన్యపురిలోని సీనియర్ సిటిజన్స్ భవనంలో ఆలోచన పత్రిక ప్రథమ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వృత్తులను ఆధునీకరించి అందరూ ఆయా వృత్తులను స్వీకరించేలా చేయాలని అన్నారు. మరో ముఖ్యఅతిథి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతి మనిషిలో రాక్షసత్వం నషించి మానవత్వం మేలుకొల్పే మంచి కథనాలు రావాలని ఆకాంక్షించారు. ఆ రకంగా తీర్చిదిద్దే మంచి సాహిత్యాన్ని సృష్టించడంలో ఆలోచన ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలోచన వ్యవస్థాపకులు శ్రీనివాస్రెడ్డి, బండారు రాంమోహన్, సూర్యప్రకాష్, విజయ, కర్ణాకర్రెడ్డి, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.