Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారంలోకి వస్తే స్లమ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి
- ప్రజలంతా తమ పార్టీని ఆదరించాలి
- అంబర్పేట బీఎల్ఎఫ్ అభ్యర్థి శ్రీహరి
నవతెలంగాణ - అంబర్పేట
అంబర్పేట మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని నియోజకవర్గ బీఎల్ఎఫ్ అభ్యర్థి గడప శ్రీహరి అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ పరిధిలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు పర్యాయాలుగా అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్న కిషన్రెడ్డి బడుగు, బలహీన వర్గాలకు చేసిందేమీ లేదని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో పబ్బం గడుపుతున్నారన్నారు. నియోజకవర్గంలోని స్లమ్ ఏరియాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే స్లమ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ స్లబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏండ్లయినా రాష్ట్రంలో బీసీ, ఎంబీసీలను, వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలను, మైనార్టీలను, అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, పేదలకు మాత్రం ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎల్ఎఫ్ను గెలిపిస్తే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఎంబీసీ కులాల అభ్యర్థి సీఎంగా ఉంటారని, రాబోయే రోజుల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా బీఎల్ఎఫ్ని ఆదరించాలని కోరారు. అంబర్పేట నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందని, అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రచించామని వివరిం చారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత కులాల మధ్య చిచ్చుపెడుతూ కాలం వెల్లదీస్తోం దన్నారు. ఎలాంటి అభివృద్ధి చేయకుండా ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తానన్న కేసీఆర్.. కనీసం రాష్ట్రవ్యాప్తంగా రెండువేల ఉద్యో గాలు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటివరకు విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వంటి వాటికి కనీసం నిధులు కూడా విడుదల చేయ కపోవడం దురదృష్టకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు.