Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొరల పాలన పోయి.. బహుజన రాజ్యం రావాలి
- మేడ్చల్ బీఎల్పీ అభ్యర్థి గుజ్జ రమేష్
నవతెలంగాణ - జవహర్నగర్
మేడ్చల్ గడ్డపై బహుజనుల జెండా ఎగురవేయాలని మేడ్చల్ బీఎల్పీ అభ్యర్థి గుజ్జ రమేష్ అన్నారు. బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో బీఎల్ఎఫ్ జవహర్నగర్ అధ్యక్షులు యాక స్వామి అధ్యక్షతన బుధవారం జవహర్నగర్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ బీఎల్పీ అభ్యర్థి గుజ్జ రమేష్, పలువురు వక్తలు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో దొరల పాలన పోయి బహుజనుల రాజ్యం అధికారంలోకి రావడమే బీఎల్ఎఫ్ లక్ష్యమన్నారు. సామాజిక న్యాయం, సమాగ్రాభివృద్ధి సాధించేందుకే బహుజనుల పార్టీ కృషిచేస్తున్నదని వివరించారు. ఇందుకు రాష్ట్ర ప్రజలు బీఎల్ఎఫ్కు మద్దతునిచ్చి గెలిపించాలని కోరారు. బీఎల్ఎఫ్ ప్రజల జీవితాలను మార్చేలా, సర్వ హక్కులు కల్పించేలా కృషిచేస్తున్నదని తెలిపారు. అది సాధ్యపడాలంటే బహుజనులు నాగలి-రైతు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. జవహర్నగర్ డంపింగ్ యార్డులను తరలించే నినాదంతో బీఎల్ఎఫ్ పోరాడనుందని తెలిపారు. బహుజనులు వలస వచ్చి నివసిస్తున్న ప్రాంతం జవహర్నగర్ అని తెలిపారు. మున్ముందు బహుజనుల ఐక్య సమ్మేళనాన్ని నిర్వహించబోతున్నామన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సత్యం, మేడ్చల్ బీఎల్ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ చింతల యాదయ్య, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వెంకట్, జవహర్నగర్ సీపీఐ(ఎం) నాయకులు దావత్ నగేశ్, శివ నారాయణ, వనజాక్షి, విజయ పాల్గొన్నారు.
.