Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
దసరా పండగకు ఒక్క రోజే మిగిలివుం డటంతో హైదరాబాద్లో ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలు, దినసరి కూలీలుగా పనిచేసుకుంటున్న తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలు సొంతూళ్లకు పయనం అవడంతో బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఎంజీబీఎస్, జూబ్లీబస్ స్టేషన్, సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయారు. ఇసుకేస్తే రాలనంత జనం బస్ స్టేషన్లకు చేరుకోవడంతో వీరిని క్రమబద్దీకరింపండగకు ప్రత్యేక బస్సులు, రైళ్లు నడుపుతుండటంతో రిజర్వేషన్లు చేయించుకున్న వారు ప్రశాంతంగా ప్రయాణం చేస్తుండగా రిజర్వేషన్లు దొరకని వారు తమ భార్యాబిడ్డలతో అదనపు ఛార్జీలు భరిస్తూ అనేక మైళ్ల దూరం వరకు ప్రయాణం కొనసాగించి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఇదిలావుండగా టీఎస్ఆర్టీసీ ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 1981 బస్సులు, 16 నుంచి 18 అర్ధరాత్రి వరకు 2499 చొప్పున దాదాపు 4480 బస్సులను నడిపింది. ఈనెల 8వ తేదీ నుంచి 17 అర్ధరాత్రి వరకు దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణికులను వారి వారి సొంతూళ్లకు చేరవేసినట్టు టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్ పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా జూబ్లీ, ఎంజీబీఎస్, కాచిగూడ, ఎస్ఆర్నగర్, అమీర్పేట, ఉప్పల్, కూకట్పల్లి బస్టేషన్ల వద్ద మంచినీరు, టారులెట్ల సౌకర్యం కల్పించింది. పండగకు ప్రయాణికులు అధిక సంఖ్యలో బస్ స్టేషన్లకు వస్తారని తెలిసి జేబు దొంగలు తమ పనికానిస్తారు కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా బస్ స్టేషన్లలో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ఆర్టీసీ సెక్యూర్టీ విభాగం సిబ్బందితో పాటు పోలీసులను కూడా రంగంలోకి దింపింది. మఫ్టీలో ఉన్న సెక్యూర్టీ, పోలీసు సిబ్బంది ప్రతి క్షణం ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించింది. ఇదిలావుండగా టీఎస్ఆర్టీసీకి ధీటుగా రెగ్యూలర్ సర్వీసులతో పాటు అదనపు కోచ్లతో దాదాపు నలభైకి పైగా రైళ్లు నడిపిన దక్షిణమధ్య రైల్వే వారం రోజుల్లో దాదాపు నాలుగున్న నుంచి ఐదున్నర లక్షల మందిని దసరా పండగ చేసుకోవడానికి సొంతూళ్లకు చేరవేసింది. బుధవారం సద్దుల బతుకమ్మ ఉండటంతో ప్రయాణికులు మంగళవారం ఉదయం నుంచే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్లకు చేరుకోవడంతో వారిని క్రమబద్దీకరించడం రైల్వే అధికారులకు, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. దసరా పండగకు వెళ్లే వారితో బుధవారం తెల్లవారు జామున వందల సంఖ్యల్లో సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, లింగంపల్లి స్టేషన్లకు చేరుకోవడంతో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ఆయా రైల్వే స్టేషన్లతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో విస్తరించివున్న తమ జోన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పరిశుభ్రమైన మంచినీటిని ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా టారులెట్లను పునరుద్ధరించారు. రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలతో డేగకన్ను ఏర్పాటు చేయడమే కాకుండా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.