Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ నరసింహన్ ఆదేశాలు జారీ
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
విద్యార్థుల పోరాటం, ప్రొఫెసర్ల విన్నపం మేరకు రాష్ట్ర గవర్నర్ ఓయూలో 3 కోర్సులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఓయూ టెక్నాలజీ కళాశాలలో ప్రోగ్రామ్స్ క్రింద నిర్వహించబడిన 3 కోర్సులకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను ఆదివారం వీసీ రామచంద్రం కళాశాల ప్రిన్సిపాల్కు చేర వేశారు. కెమికల్ ఇంజనీరింగ్, పుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ ఈ 3 విభాగాలకు టెక్నాలజీ విభాగం క్రింద ప్రోగ్రామ్గా పనిచేశాయి. ప్రస్తుతం వీసీ ఆదేశాలతో ఆ మూడు విభాగాలను విభజించాలని ఆదేశించారు. ఈ విభాగాల విభజన కోసం కొన్నేండ్లుగా విద్యార్థులు ఉద్యమిస్తూ ఆచార్యులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ కోర్సుల విభజన కోసం, వాటికి స్వయం ప్రతిపత్తి కోసం టెక్నాలజీ కళాశాల డిపార్ట్మెంట్ కమిటీ (డీఎల్), అకాడమిక్ కౌన్సిల్, గవర్నింగ్ బాడీలు వేర్వేరుగా సమావేశమై ఆమోదం తెలిపారు. ఈసీ-అప్రూల్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి పంపిం చగా, ఉన్నత విద్యామండలి దాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో ఓయూకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం 6.10.2018న రిజిస్ట్రార్ గోపాల్రెడ్డి, టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ శ్యాంసుందర్, డీన్కు ఆ మూడు శాఖల్ని సత్వరమే విభజించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రిన్సిపాల్, డీన్లు ఆయా శాఖలను విభజిస్తూ, వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే కొసమెరుపు విషయం 3 విభాగాలకు కనీస సంఖ్యలో ఆచార్యులు లేకపోవటం కొంతమేరకు ఆందోళన కలిగిస్తుంది. అయితే ఏ ఉద్ధేశంతో కోర్సులను విభజించారో.. అదే స్ఫూర్తితో 3 విభాగాలకు ఆచార్యుల నియమిస్తే ఫలితం ఉంటుందని విద్యార్థులు కోరుతున్నారు. ఈ విభజన వల్ల సంబంధిత విభాగాలకు వర్సిటీతోపాటు పలు పెండింగ్ సంస్థలు నిధులు ఇచ్చే అవకాశం ఉంది.
నవంబర్లో విభజిస్తాం : ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్.శ్యాంసుందర్
ప్రస్తుతం ఈ మూడు విభాగాలను నవంబర్లో కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో విభజిస్తామని, వీటికి ప్రత్యేకంగా హెడ్స్, బోసులను నియమిస్తామని ప్రినిపాల్ శ్యాంసుందర్ తెలిపారు. విభజన వల్ల 3 కోర్సులు విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఇందుకు సహకరించిన గవర్నర్, ఓయూ వీసీ, రిజిస్ట్రార్కు కృతజ్జతలు తెలిపారు.