Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లయ్య
నవతెలంగాణ - అంబర్పేట
బీఎల్ఎఫ్ అభ్యర్థుల గెలుపునకు గంగపుత్ర సంఘం నాయకులంతా కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ.ఎల్.మల్లయ్య కోరారు. ఆదివారం అంబర్పేట డివిజన్లోని జైస్వాల్ గార్డెన్లో 62 గంగపుత్ర సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుడారు. 70 ఏండ్ల నుంచి బీసీ, ఎంబీసీ కులస్తులను అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో బీఎల్ఎఫ్ బీసీలకు 65 సీట్లు కేటా యించి, బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం హర్షనీయమన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎల్ఎఫ్కు సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నామని, అంబర్పేటలో బీఎల్ఎఫ్ అభ్యర్థి గెలుపునకు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ అభ్యర్థి గడప శ్రీహరి మాట్లాడుతూ తనను గెలిపిస్తే గంగపుత్రుల సమ స్యలపై చట్టసభల్లో పోరాడుతానని, బీసీ కులాలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా కొట్లాడు తానని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించానని చెప్పారు. బీఎల్ఎఫ్ను అధికారంలోకి తీసుకొస్తేనే బహుజనుల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. అంబర్పేట నియోజకవర్గంపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, తనకు అవకాశం కల్పించాలని కోరారు. 15 ఏండ్లుగా అంబర్పేట ఎమ్మెల్యేగా కిషన్రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, కనీసం డిగ్రీ కళాశాల, ప్రభుత్వ కార్యాలయాలు రప్పిచడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. బీసీ నాయకుడిగా చెప్పుకొనే కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు ఒక్కసారి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీ, మంత్రిగా ఉన్నా నియోజకవర్గానికి అభివృద్ధికి ఏమీ చేయలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 1,000 మందికి కూడా ఉద్యోగులు ఇవ్వలేదన్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో మరోసారి ప్రజలను మోసం చేయడానికే తప్ప ఆచరణలో అమలు చేయదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం రాష్ట్ర నాయకులు పాకచందర్, గుంటియాదగిరి, పెద్దపెల్లి చంద్రశేఖర్, శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.