Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ మాత్రం తొలి విడతలోనే 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచారం లో దూసుకెళ్తోంది. అలాగే బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ సైతం రెండు సార్లు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అధికార పార్టీకి దీటుగా బీఎల్ఎఫ్ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. కానీ మహాకూటమి అభ్యర్థుల సీట్లు ఖరారు కాకపోవడంతో ఆయా పార్టీల తరపున పోటీలో నిలబడే అభ్యర్థులు తీవ్ర నిరాశలోకి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలోని మిత్రపక్షామైన టీడీప ీకి కేటాయించే సీట్ల విషయంలో కాంగ్రెస్ పూర్తి క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. గ్రేటర్తో పాటు మొత్తంగా 18 సీట్లిచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తొలి నుంచి కాంగ్రెస్ మూడు పార్టీలకు కలిపి 20-22 సీట్ల మధ్య సర్దుబాటు చేయాలని చూస్తోంది.
గ్రేటర్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ స్థానాలు ఉండగా, దీంట్లో నుంచి టీడీపీ సగానికిపైగా అసెంబ్లీ సెగ్మెంట్లను కోరుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ పార్టీకి 9-10 సీట్లు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా టీడీపీ వర్గాలు సైతం ఇదే విషయాన్ని చెబుతుండడం విశేషం. తొలి నుంచి గ్రేటర్ పరిధిలో టీడీపీ మెజార్టీ స్థానాలను అడుగుతోంది. ఇందులో గత ఎన్నికల్లో గెలిచిన వాటితోపాటు రెండో స్థానంలో నిలిచిన సీట్లను ఇవ్వాలని కాంగ్రెస్కు తెలియజేసింది కూడా. కాంగ్రెస్ మాత్రం నగరం లోపల టీడీపీకి ఐదు లేదా ఆరు సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించుకోవాలని టీడీపీ నేతలకు గ్రీన్సిగల్ ఇచ్చినట్టు సమాచారం. ఇందులో సికింద్రాబాద్, ఖైరతాబాద్, మలక్పేట, చార్మినార్, ముషీరాబాద్, కంటోన్మెంట్ స్థానాలు ఉన్నాయి. దీంతో ముషీరాబాద్, కంటోన్మెంట్ స్థానాల్లో కొంత సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్... టీడీపీకి 5 సీట్లు గాను కేటాయిస్తే.. ఈ రెండు స్థానాల్లో ఒక స్థానం కాంగ్రెస్కు వెళ్లే అవకాశం ఉంది. కాగా ఇతర మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. కాగా నగర శివార్లలోని మిగతా 9 సెగ్మెంట్లలో రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్ నుంచి కాంగ్రెస్ పోటీ చేసే అవకాశముండగా, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్గిరి, ఉప్పల్ స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. అలాగే కుత్బుల్లా పూర్ సీటు కూడా కేటాయించాలని టీడీపీ బలంగా కోరుతోంది. కాగా ఇప్పటికే ముషీరా బాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ నగరా ధ్యక్షుడు ఎమ్మెన్, ఖైరతాబాద్ అభ్యర్థిగా ఎల్ దీపక్రెడ్డి, సికింద్రాబాద్ నుంచి కూన వెంకటేశ్ గౌడ్ ఎన్నికల ప్రచారానికి గ్రీన్ సిగల్ ఇచ్చారని సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో వీరు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే కీలక నేతలు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు భేటీలు జరుపుతున్నారు.
ఈసారి ఇవ్వాల్సిందే..
మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ మధ్య ముషీరాబాద్ సీటు విషయంలో తీవ్ర చర్చ జరగుతుంది. ముషీరాబాద్ సీటుపై నగర అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాస్రావు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా ప్రతి ఎన్నికల్లో ముషీరాబాద్ సీటు ఇతర పార్టీలకు కేటాయిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం టీడీపీ అభ్యర్థి ఎమ్మెన్కు సీటు కేటాయించాలని పార్టీ నేతలతోపాటు కార్యకర్తలు కోరుతున్నారు. ఆయనకు సీటు కేటాయిస్తే సునాయసంగా గెలిచే అవకాశముందని పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. ప్రధానంగా స్థానికుడు కావడంతోపాటు ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి ఉండడం కూడా ఆయనకు కలిసోచ్చే అంశమని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ అధిష్టానం సైతం ఎమ్మెన్ను ముషీరాబాద్ నుంచి బరిలో దింపాలని యోచిస్తోంది. ఇదే విషయాన్ని కూడా కాంగ్రెస్కు చెప్పినట్టు తెలుస్తుంది. టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు కూడా ఎమ్మెన్ విషయంలో కొంత సానుకూలంగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.