Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
హౌసింగ్ బోర్డు డివిజన్లోని కృష్ణానగర్కాలనీ రోడ్డు నెంబరు-5లో నివాసముంటున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైయింటర్ జేమ్స్ కుమా రుడు చిన్నా(32) గుండెపోటుతో మరణించ డంతో ఉప్పల్ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి తూళ్ల వీరేందర్గౌడ్ మంగళవారం పరామర్శించి శ్రద్ధాం జలి ఘటించారు. మృతుడు చిన్నా భార్యను, ఇద్దరు పిల్లలను కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో పిల్లలకు తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్టీఆర్ ట్రస్టు నుంచి భరోసా కల్పించేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డివిజన్ అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి యాదిగిరి, సీనియర్ నాయకులు వీరభద్రం, లక్ష్మీనారాయణ, రాజుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ అమర్కుమార్, జాయింట్ కార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొన్నారు.