Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నాకు ప్రణ భయం ఉంది... నన్ను చంపేందుకు కొంత మంది ప్రత్యర్థులు ముంబాయి నుంచి షాట్షటర్లను హైదరాబాద్కు రప్పించారంటూ చాంద్రాయణగుట్ట మజ్లిస్ పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పదే పదే ప్రస్తావిస్తుండటంతో హైదరాబాద్ సిటీ పోలీసు యంత్రంగం ఆయనకు భద్రత పెంచింది. ఐదేండ్ల క్రితం బార్కస్ ప్రాంతంలో కార్యకర్తలతో కలిసి అక్బరుద్దీన్ ఒవైసీ పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో మహ్మద్ పహెల్వాన్ అన్న కుమారులు కత్తులతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అక్బరుద్దీన్కు 2+2 భద్రత కల్పించింది. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలు రావడంతో మజ్లిస్ పార్టీ తరపున చాంద్రాయణగుట్ట అభ్యర్థిగా బరిలోకి దిగిన అక్బరుద్దీన్ ఒవైసీ రెండు నెలల నుంచి తన సెంగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్నారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన తన సెంగ్మెంట్లోనే కాకుండా చార్మినార్, యాకుత్పుర, కార్వాన్, నాంపల్లి సెంగ్మెంట్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభల్లో నాకు ప్రణ భయం ఉంది... ముంబాయి నుంచి షాట్షఉటర్లను రప్పించి చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ప్రత్యర్థులపై బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు సిటీ పోలీస్ కమిషనర్కు సమాచారం అందించాయి. దీంతో సిటీ పోలీసు యంత్రంగం అక్బరుద్దీన్కు గురువారం నుంచి అదనపు భద్రత కల్పించారు. గతంలో ఆయనకు 2+2 భద్రత ఉండేది.తాజాగా ఆయనకు 4+4 భద్రతను పెంచారు. అంతే కాకుండా ఆయన ఎక్కడైతే బహిరంగ సభల్లో పాల్గొంటున్నారో ఆయా ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసే విధంగా సిటీ పోలీసులు చర్యలు తీసుకున్నారు.