Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
మల్లాపూర్ డివిజన్లోని పలు కాలనీలలో తాగునీటి సమస్యను తీర్చేందుకు నూతన పైపులైన్లను వేసేందుకు కృషి చేస్తున్నామని కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం న్యూ భవానినగర్, గ్రీన్హీల్స్కాలనీ, నాగలక్ష్మినగర్ కాలనీలలో వాటర్వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో మంచినీటి నూతన పైపులైన్లను వేయనున్నామని తెలిపారు. ఇప్పటికే చాలా కాలనీల్లో పైప్లైన్లను వేస్తామన్నారు. మిగతా కాలనీల్లోనూ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ప్రాజెక్టు ఏఈ జగదీష్, నాయకులు భాస్కర్గౌడ్, జీవన్రెడ్డి, ప్రహ్లాద్, దయాకర్, రంగారెడ్డి పాల్గొన్నారు.