Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేరేడ్మెట్
అల్వాల్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శరణ దంత వైద్యశాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో డాక్టర్ సంధ్యరాణి పాల్గొని మాట్లాడారు. ఈ శిబిరం ద్వారా 215 మంది విద్యార్థినులకు దంత పరీక్షలు నిర్వహించి, టూత్పేస్టులను, బ్రష్లను, కాల్షియం బీ కాంప్లెక్స్, ఆయింట్మెంట్లను అదించినట్టు తెలిఆపరు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంధ్య, సునీత పాల్గొన్నారు.