Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్లపల్లి జైల్ పర్యవేక్షణాధికారి భాస్కర్
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
చర్లపల్లిలో జైల్లో తయారు చేస్తున్న ఉత్పత్తులకు విశేష ఆదరణ లభిస్తున్నదని చర్లపల్లి జైల్ పర్యవేక్షణాధికారి ఎంఆర్ భాస్కర్ అన్నారు. శుక్రవారం కుషాయిగూడ సాయినగర్లో జైల్లో తయారు చేసి ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉపాధి కోసం త్వరలో వంద పెట్రోల్ బంకులు , వంద జైళ్లలో తయారైన వస్తు ప్రదర్శన శాలలో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఖైదీలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తామని అన్నారు. ఖైదీలకు పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధిని సైతం కల్పిస్తున్నామని తెలిపారు. పెట్రోల్ బంక్, బేకరీ, ఫ్యాక్టరీలో ఉత్పత్తులైన సబ్బులు, ఫినాయిల్, డిరీ, కార్పేంటరీ బెంచీలు, అల్మారాలు, బీరువాలను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపపర్యవేక్షణాధికారి చింతల దశరథం, సమ్మయ్య, జైలర్లు జనార్దన్రెడ్డి, కుషాయిగూడ వార్డు సభ్యులు శ్రీదేవి, భరత్, టీచర్ ప్రశాంత్ పాల్గొన్నారు.
ఉత్పత్తుల విక్రయానికి ఆహ్వానం
చర్లపల్లి జైల్లో తయారైన వస్తువులను విక్రయిం చడానికి ఉత్సాహావంతులైన వ్యాపారులు, దుకాణ దారులు ముందుకు రావాలని పర్యవేక్షణాధికారి భాస్కర్ కోరారు. జైల్ ఉత్పత్తుల నాణ్యతకు విశేష ఆదరణ ఉంటున్నదన్నారు. మేడ్చల్ , రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని సిటీ పరిసర ప్రాంతాలు, మండల కేంద్రాలలో మై నేషన్ అవుట్లెట్ ఏర్పాటుకు దుకాణదారులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వస్తువులు అందించడానికి ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశం 15 రోజులు ఉంటుందని పూర్తి వివరాలకు 9494632106, 9440543417ను సంప్రదించాలని సూచించారు.
ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య