Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సుగుణమ్మ
- బీఎల్ఎఫ్ బలపరిచిన ఎంసీపీఐ(యూ) శేరిలింగంపల్లి ఎమ్మెల్యే
అభ్యర్థి తాండ్ర కుమార్కు మద్దతు
నవతెలంగాణ - మియాపూర్
తెలంగాణలో బహుజనులకు అధికారం రావాలని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సుగుణమ్మ తెలిపారు. బీఎల్ఎఫ్ బలపరిచిన ఎంసీపీఐ(యూ) శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి తాండ్ర కుమార్కు ఆమె మద్దతు తెలిపారు. ఆమె మాట్లాడుతూ..బీఎల్ఎఫ్తోనే పేద ప్రజల బతుకులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణలో అంబేద్కర్ వాదులు, మార్క్సిస్టులు కలిసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని చెప్పారు. బీఎల్ఎఫ్తోనే సమస్యల పరిష్కారమవుతాయని తెలిపారు. తాము సాధించిన తెలంగాణ ఈ రోజు కొంతమంది తన చేతుల్లోకి వెళ్ళిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కమ్యూనిస్టులు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అనంతరం తాండ్రకుమార్ మాట్లాడుతూ సుగుణమ్మ లాంటి వారి మద్దతుతో, వారి ఆలోచనా విధానంతో బీఎల్ఎఫ్ రాష్ట్రంలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రజలు టీఆర్ఎస్ మోసపూరిత హామీలను నమ్మొద్దని చెప్పారు. బీఎల్ఎఫ్తోనే సమస్యల పరిష్కరించబడుతాయని తెలిపారు. బీఎల్పీ రైతు నాగలి గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుకారం నాయక్, కన్నా శ్రీనివాస్, సుకన్య, లక్ష్మి, మురళి తదితరులు పాల్గొన్నారు.