Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -జుబ్లీహీల్స్
ఈవీఎం మిషన్స్పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు డాక్టర్ అలోక్ శుక్లా రచించిన పుస్తకాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25 లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పుస్తక రచయిత అలోక్ శుక్లా, వీఎస్ సంపత్, జెఎంలుంగ్డో, మాజీ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియా సమావేశంలో అలోక్ శుక్లా మాట్లాడుతూ ఈవీఎంలపై గతంలో అనేక అనుమానాలుండేవని, వాటిని వాడకుండా కొంతకాలం సుప్రీంకోర్టు ఆదేశాలతో నిలుపుదల చేశారని అన్నారు. పేపర్ బ్యాలెట్ వల్ల అనేక మోసాలు చేయవచ్చని, కౌంటింగ్ ఆలస్యం అవుతుందని, దొంగ ఓట్లు ఎన్ని అయినా వేసుకోవచ్చని తెలిపారు. ఈవీఎం మిషన్ ద్వారా ఓటు వేస్తే, మీరు కోరుకున్న నాయకులకే ఓటు వెళ్తుందన్నారు ఓటర్లు ఎలాంటి అనుమానాలు చెందకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు.