Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు
ఉస్మానియా యూని వర్సిటీ: లాలాపేట్లోని మురికి వాడల్లో సదుపాయాలు కల్పిస్తా మని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తీరుస్తానని సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు అన్నారు. ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా లాలాపేటలోని సీబీఎన్నగర్, సిరిపురికాలనీ, సత్యనగర్, లక్ష్మినగర్ ప్రాంతాల్లో స్థానికులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. నాలుగు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలకు అవసరం అయ్యే పనులు చేపట్టినట్లు తెలిపారు. లాలాపేట్ కల్వర్ట్ విస్తరణ, నాలా విస్తారణ, ఆర్వోబీ పునర్ నిర్మాణం లాంటి ప్రాజెక్టుకు కోట్లు కేటాయించినట్టు తెలిపారు. నియోజకవర్గంలో రెట్టింపు స్థాయిలో సంక్షేమ పథకాలు, పించన్లు ఇప్పించినట్టు గుర్తు చేశారు. తప్పక విజయం సాధిస్తామని, తనకు పోటీ ఎవ్వరు లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సరస్వతి, హరి, వేణుగోపాల్, గణేష్, సునిల్, చంద్రమౌళి, సత్యనారాయణ, ఎర్రనాగు, మధుకర్, సంతోష్, రాజీవ్గుప్తా, శ్రీనివాస్గౌడ్, పలు డివిజన్స్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.