Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఎల్ఎఫ్ బలపర్చిన బీఎల్పీ అభ్యర్థి గెలుపొందడం ఖాయమని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఇ.సత్యనారాయణ అన్నారు. నియోజకవర్గం బీఎల్ఎఫ్ అభ్యర్థి రాఘవేంద్రస్వామి గౌడ్కి ఆయన శుక్రవారం బీ-ఫారం అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తేనే బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. నియోజకవర్గంలోని ప్రజా, కార్మికుల సమస్యలపై బీఎల్ఎఫ్ మొదటి నుంచి పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వస్తేనే కార్మికుల కనీస వేతనాలు, ప్రజా సమస్యలు పరిష్కామవుతాయని పేర్కొన్నారు. జి.రాఘవేంద్రస్వామిగౌడ్ విజయానికి కార్యకర్తలందరూ సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఎల్ఎఫ్ నాయకులు వి.జైపాల్రెడ్డి, ఎస్.రామ్మోహన్, ఆనంద్, టి.ఆనంద్, సాయిలు, సురేష్, రాజు, భాస్కర్ పాల్గొన్నారు.