Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్పేట
అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మహాకుటమి కాంగ్రెస్ మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్.కే.పురం డివిజన్లోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైకు ర్యాలీ ప్రారంభించారు. అనంతరం డివిజన్ పరిధిలోని గ్రీన్హిల్స్ కాలనీ, వాసవికాలనీ, టెలిఫోన్కాలనీ, రామకృ ష్ణాపురం, యాదవనగర్, అల్కాపురి, ఎన్టీఆర్ నగర్, చిత్రలేఅవుట్, వాస్తుకాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ఏర్పాటుతో కేసీఆర్ గుండెల్లో వణుకు పుట్టిందన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అర్హత లేదన్నారు. కేసీఆర్ను గద్దె దించేందుకు కూటమిలోనే భాగస్వామ్య పక్షాలన్ని ఐక్యంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సంకెపల్లి సుధీర్రెడ్డి, పగిళ్ల భూపాల్రెడ్డి, మహేందర్యాదవ్, హైమద్, లక్ష్మీనారాయణ, మహ్మద్ సాజిద్, పెండ్యాల నాగేష్, ఊర్మిళరెడ్డి పాల్గొన్నారు.
మీర్పేట్ : మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి గెలవడం ఖాయమని ఎంపీటీసీ కామేశ్రెడ్డి అన్నారు. జిల్లెల్గూడలోని పలు కాలనీల్లో శుక్రవారం గడప గడపకు తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి భూపాల్రెడ్డి, ఎంపీటీసీలు అనీల్ యాదవ్, పార్వతమ్మ రాంచందర్, మాజీ ఎంపీపీ సిద్ధాల లావణ్య, మహిళా అధ్యక్షురాలు బండి మీనా నగేష్, బాలమణి పాల్గొన్నారు.
బడంగ్పేట : మహేశ్వరం నియోజక వర్గం మహాకూటమి అభ్యర్థి పి.సబితాఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ బడంగ్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నాయకులు ఇంటింటీ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన అధ్యక్షులు గోవర్దన్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.