Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో 126కి చేరిన నామినేషన్లు
నవతెలంగాణ - సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాలో శుక్రవారం 31 మంది అభ్యర్థులు 36 నామినేషన్లు దాఖలు చేశారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు రోజులుగా 126 నామినేషన్లు వచ్చాయని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా పంపరి నర్సింహానరేందర్ నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఎం.గోపినాథ్, తెలంగాణ కమ్యునిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా కుక్కల నరేష్కుమార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి.విష్ణువర్థన్రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. మలక్పేట్ నియోజకవర్గం నుండి అఖిల భారత జనసంఫ్ు పార్టీ నుండి పవన్కుమార్ శర్మ 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆర్జేడీ పార్టీ నుండి సయ్యద్ రజా ఎమ్డి.అన్వర్, అన్న వైఎస్సార్ అభ్యర్థిగా సయ్యద్ అన్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుండి అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫాతిమా భాను నామినేషన్ దాఖలు చేశారు. అంబర్పేట్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అ భ్యర్థులుగా కె.శ్యామ్, కొమిరి సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. గోషామహల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థులుగా సోమ త్రినాథరావు, నర్సింగ్ సింగ్లు, బహుజన సమాజ్ పార్టీ అ భ్యర్థులుగా చంద్రశేఖర్రావు గాజుల నామినేషన్లు దాఖలు చేశారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఎం.సీతారాంరెడ్డి, బీజేపీ నుండి కుమారి సహజాది స య్యద్లు నామినేషన్లు దాఖలు చేశారు.
సనత్నగర్ నియోజకవర్గం నుంచి బహుజన రాష్ట్ర సమితి అ భ్యర్థిగా ఎంఆర్ అశోక్కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాస్. (మూడుసెట్లు), టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేశ్గౌడ్ నామినేషన్ దా ఖలు చేశారు. కార్వాన్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అమర్సింగ్ (రెండు సెట్లు), బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా గుట్టమీది విఠలయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఖైర తా బాద్ నియోజకవర్గం నుండి నవభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఎం.కల్యాణరామకష్ణ, స్వతంత్ర అభ్యర్థిగా మిద్దె క్రిష్ణ, ఇం డియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్కుమార్, అంబేడ్కర్ నేష నల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి.జానకి, బ హుజనలెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా కె.యాదగిరిలు నామినేషన్లు దాఖలు చేశారు. యాకత్పుర నియోజకవర్గం నుండి శివసేనా అభ్యర్థిగా జ మాల్పూర్ మహేష్ కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా కట్టా సుదర్శన్ నామినేషన్లు దాఖలు చే యగా, బహదూర్పుర నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా మీర్ ఇనాయత్ అలీ బాక్రి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్వతంత్య్ర అభ్యర్థిగా ఏచు సునీల్, లోక్ తాంత్రిక్ సర్వజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పార్వతి శ్రీరాల నామినేషన్లు దాఖలు చేశారు.