Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రాంనగర్
ముషీరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి రాంనగర్ డివిజన్లోని పలు బస్తీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. బంగారు తెలంగాణ సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం ఇవ్వాలని ఓటర్లకు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రేషం మల్లేష్, నాయకులు ప్రకాష్ రెడ్డి, సిరిగిరి శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.