Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ తరపున జనగామ నుంచి పోటీ చేస్తున్న కొత్తపల్లి సతీష్కుమార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ యూత్ వింగ్ కో-ఆర్డినేటర్ కొత్తపల్లి సతీష్కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. బహుజన సమాజ్వాది పార్టీ తరపున జనగామ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నట్టు ఆయన శుక్రవారం తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పలుసార్లు చెప్పినా పార్టీలో పట్టించుకునే నాధుడే లేదని ఆరోపించారు. టీఆర్ఎస్లో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే బహుజన సమాజ్ వాది పార్టీలో చేరి ఆ పార్టీ తరపున జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు లక్డీకాపూల్లోని ఆ పార్టీ కార్యాలయంలో ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ సభ్యులు విపి సింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య చేతుల మీదుగా బీ ఫాంను తీసుకోవడం జరిగిందని కొత్తపల్లి సతీష్కుమార్ తెలిపారు. జనగామలో బహుజన సమాజ్వాదీ పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు.